నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 764క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50, మిషన్ భగీరథ తాగు నీటి అవసరాలకు 152 క్యూసెక్కులను వినియోగిస్తున్నారన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగుల(90.313 టీఎంసీలు) సామర్థ్యం కాగా సోమవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటిమట్టం కలిగి ఉందని ఏఈఈ తెలిపారు.