హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్లోకి వలసలు జోరు కొనసాగుతున్నది. బహుజనబంధు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇతర పార్టీల్లోని బడుగు బలహీనవర్గాల నాయకులు టీఆర్ఎస్లోకి క్యూకడుతున్నారు.
బీసీ కార్యకర్తలు, నాయకుల పట్ల బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్న తీరు నచ్చకపోవడంతో సీనియర్ నేత, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కారెక్కిన విషయం తెలిసిందే.
తాజాగా శ్రవణ్ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త పనస రవి కుమార్ టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.