నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలం ఉచారాల జర్పుల తండాకు చెందిన 60 కుటుంబాలు దేవరకొండ శాసన సభ్యుడు రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన వారికి గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తమ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని అని ఆయన అన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు.
పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది అని ఆయన అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని ఆయన అన్నారు. గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు TVN రెడ్డి, కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బిక్కు నాయక్, జైహింద్ రెడ్డి, దాసు,చందు, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.