హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని సీబీఐ నమోదుచేసిన కేసులపై సీబీఐ కోర్టులో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలన్న ఇందూ శ్యాంప్రసాద్రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారించారు.