చేవెళ్ల టౌన్ : దివంగత మాజీ మంత్రి ఇంద్రారెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి(Minister Sabita Indrareddy) అన్నారు. ఇంద్రారెడ్డి వర్ధంతి(Death anniversary) సందర్భంగా చేవెళ్ల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి విగ్రహానికి కుమారులు కార్తీక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, కౌశిక్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, డీసీఎం ఎస్ చైర్మన్ పట్లోళ కృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఆమె మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పేదల(Poor People) అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని , చేవెళ్ల ప్రాంత ప్రజల గుండెల్లో ఇంద్రారెడ్డి కుటుంబం చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం(Telangana state) ఇంద్రన్న కల అని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో సుపరిపాలన కొనసాగుతుందని తెలిపారు.
ప్రజలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు సేవలు చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చేవెళ్ల ప్రజలు రాజకీయ జీవితం ఇచ్చినందుకే రాష్ట్ర ప్రజలకు సేవలు చేసే అవకాశం వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మాలతి కృష్ణా రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్ రాజ్, వైస్ ఎంపీపీ ప్రసాద్, మండల అధ్యక్షుడు ప్రభాకర్, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేష్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.