హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ‘ఎకానమీ మీల్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో కలిసి ప్యాకెట్-ఫ్రెండ్లీ క్యాటగిరీ మీల్స్ రూ.20, స్నాక్ మీల్స్ రూ.50కే అందిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా 100కు పైగా రైల్వే స్టేషన్లలో ఎకానమీ మీల్స్ను అందుబాటులోకి తీసుకువచ్చిన రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 12 స్టేషన్లలో 23 కౌంటర్ల ద్వారా ఈ భోజనాన్ని అందిస్తున్నదని వెల్లడించారు. వీటిలో హైదరాబాద్, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, ధోన్, నంద్యాల, పూర్ణ స్టేషన్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.