హైదరాబాద్ : పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ (IIL) రాష్ట్రంలో రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. హైదబాద్లోని జీనోమ్ వ్యాలీలో కొత్తగా జంతువులకు సంబంధించిన వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని నెలకొల్పనున్నట్లు వెల్లడించింది.
ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ కంపెనీ అందుబాటులోకి వస్తే 750 మందికి ఉపాధి లభించనుంది. ప్రజారోగ్యంతో పాటు జంతువుల ఆరోగ్యం విషయంలో కూడా ప్రపంచ ఆరోగ్య రంగానికి హైదరాబాద్ సహకారం అందిస్తుందన్నారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు సంతోషిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
Another major investment in Telangana. Indian Immunologicals Limited (IIL) announced that the company will invest about Rs 700 Crores to set up a new animal vaccine manufacturing facility in Genome Valley, Hyderabad.#InvestTelangana @indimmune_ pic.twitter.com/E3CiHObLHK
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 10, 2022