హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని మంగళవారం భారతీయ గోర్ బంజారా నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
హాస్టల్లో ఉంటున్న గిరిజన విద్యార్థులకు వెంటనే కాస్మెటిక్ చార్జీలు పెంచాలని, ఇందిరమ్మ ఇండ్లకు సాయాన్ని రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. దీంతో ఆందోళన చేస్తున్న బంజారా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, తరలించారు.