హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : భారత క్రికెటర్లు(Indian cricketers) రిషబ్పంత్(Rishabpant), అక్షర్పటేల్(Axar Patel) తిరుమల శ్రీవారిని(tirupathi దర్శించుకున్నారు. గురువారం రాత్రి వీఐపీల విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో రిషబ్ పంత్, అక్షర్ పటేల్కు వేద పండితుల వేద ఆశీర్వాదం, తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు.
భారత క్రికెటర్లకు టీటీడీ అధికారులు ప్రొటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన అనంతరం అక్షర్పటేల్, రిషబ్పంత్తో భక్తులు, అభిమానులు సెల్ఫీలు దిగారు. ఘోర కారు ప్రమాదం నుంచి బయటపడిన రిషబ్ పంత్ ..ఇటీవల కోలుకున్నాడు. మళ్లీ క్రికెట్ గ్రౌండ్లోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాడు.