17 నుంచి1,930 కిలోల ఆహార పదార్థాలు పంపిణీ
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : గోదావరి వరద ఉధృతి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద ప్రవాహానికి అనేక గ్రామాలకు రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. దాంతో ఈ గ్రామాలకు భారత వాయుసేన దళాలు హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలను చేరవేస్తున్నాయి.
ఈ నెల 17 నుంచి చర్ల గ్రామానికి 470 కిలోల ఆహారపదార్థాలు, దుమ్ముగూడెంకు 670 కిలోల సామగ్రి పంపిణీ చేసినట్టు వాయుసేన అధికారులు తెలిపారు. అన్ని ప్రాంతాలకు కలిపి ఇప్పటివరకు మొత్తం 1,930 కిలోల ఆహారపదార్థాలు చేరవేసినట్టు వివరించారు.