హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): దక్షిణాఫ్రికా-ఇండియా దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మెరుగుపర్చేందుకు తమవంతు కృషి చేస్తామని తెలంగాణ ఎన్నారై నాగరాజు గుర్రాల తెలిపారు. దక్షిణాఫ్రికాలోని హెచ్ఈ హైకమిషనర్ ప్రభాత్కుమార్, హెచ్ఈ కాన్సుల్ జనరల్ మహేశ్ కుమార్ను మంగళవారం కలిసే అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం-దక్షిణాఫ్రికా మధ్య వ్యాపార సంబంధాలను పెంపొందించడంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. ఇరుదేశాల వ్యాపార భవిష్యత్తు సహకారాల కోసం ఈ చర్చలు మరింత ఊతమిస్తాయని తెలిపారు.