హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మూడువేల కేసులు నమోదయ్యాయి. మంగళవారం 1,07,904 మందికి పరీక్షలు చేయగా.. 2,983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ సమస్యలతో ఇద్దరు మరణించారు. 2,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 22,472 మంది ఐసొలేషన్లో చికిత్స పొందుతున్నా రు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,206, మే డ్చల్ మల్కాజిగిరిలో 259, రంగారెడ్డిలో 227, సం గారెడ్డిలో 96 కేసులు వెలుగుచూశాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 22 వేలు దాటింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన బీఆర్కేభవన్లో పలు విభాగాల్లో అధికారులు, సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయంలో పలువురు ఉద్యోగులకు కూడా కరోనా సోకింది.
ఏపీలో కరోనా వ్యాప్తి నియంత్రణకు మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూను అమలుచేస్తున్నారు. ఈ నెల 31 వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఏపీ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ అమలు కాని సమయాల్లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన జరిగితే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించనున్నట్టు పేర్కొన్నది.