హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): న్యూజిలాండ్లోని తెలంగాణ జాగృతి విభాగాన్ని భారత జాగృతిగా మార్చిన సందర్భంగా ఆక్లాండ్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇండియన్ డయాస్పోరాలోని వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం భారత జాగృతి పోస్టర్ను ఆవిష్కరించారు. భారత జాగృతి అధ్యక్షురాలు కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఏర్పాటు చేయడంపై వారికి శుభాకాంక్షలు తెలిపారు. పరంజీత్ పామర్, కన్వల్జిత్ బక్షీ, ధనసుఖలాల్ తదితరులు పాల్గొన్నారు.