హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా వు ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్వాతం త్య్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా, పకడ్భందీగా ఏర్పాట్లుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన బీఆర్కేభవన్లో సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్ర సాంస్కృతిక, వారసత్వ సంపదను ప్రతిబింబించేలా సాం స్క ృతిక కార్యక్రమాల నిర్వహణకు కళాబృందాలను సమీకరించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లుచేయాలని, సామాన్యులకు ఇబ్బందిలేకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్య లు చేపట్టాలని, మాస్క్లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, అడిషనల్ డీజీ జితేందర్, సీపీ అంజనీకుమార్, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, ఇంధనశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.