World Cup-2023 | ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్ – బంగ్లాదేశ్ జట్లు గురువారం పుణే వేదికగా తలపడనున్నాయి. మ్యాచ్కు ముందు వాతావరణం అభిమానులను కలవరానికి గురి చేస్తున్నది. టోర్నీలో మూడు వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు.. నాలుగో మ్యాచ్లో బంగ్లాతో ఆడనున్నది. మ్యాచ్కు ఒకరోజు ముందు పుణేలో వర్షం కురిసింది. అలాగే, గురువారం సైతం మ్యాచ్ వర్షం పడే అవకాశాలున్నాయి. మెగా ఈవెంట్లో టీమిండియా వరుసగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, పాక్లను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. బంగ్లాపై సైతం విజయాన్ని నమోదు చేయాలని భావిస్తున్నది. మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింతే ఇరుజట్లకు ఒక్కో పాయింట్ దక్కనున్నది. ఒక్క పాయింట్ వెనుకబడినా సెమీఫైనల్ రేసులో భారత్ ఇబ్బందులు తప్పవు.
లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే సైమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో వర్షంతో బంగ్లా మ్యాచ్కు ఆటంకం కలిగితే ఒక పాయింట్ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రపంచకప్లో ఇప్పటి వరకు వర్షం కారణంగా ఏ మ్యాచ్ కూడా రద్దుకాకపోవడం ఊరట కలిగించే విషయం. ప్రాక్టీస్ మ్యాచ్ల సమయంలో వర్షం కారనంగా పలు మ్యాచులు వర్షార్పణమయ్యాయి. ఇదిలా ఉండగా.. భారత జట్టుతో పోలిస్తే బంగ్లాజట్టు బలహీనంగా ఉన్నది. అయితే, 2019 ప్రపంచకప్ తర్వాత నాలుగు వన్డేల్లో మూడు మ్యాచ్లను బంగ్లాదేశ్ గెలిచింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్లో టీమిండియా ఒక మ్యాచ్లో ఓటమిపాలైంది. అది కూడా బంగ్లాపైనే కావడం గమనార్హం.