హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో బుధవారం ఉదయం 7.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో 9.6 డిగ్రీలు, కుమ్రంభీం జిల్లా సిర్పూర్లో 9.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాజేంద్రనగర్లో 11.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.