హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు సత్ఫలితాలు ఇచ్చాయి. భూగర్భజలాలు పైకి ఉబికి వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలమట్టం పెరిగిపోయింది. రాష్ట్రంలో గత ఐదేండ్లుగా నీటి వెలికితీతలో భారీ తగ్గుదల నమోదైంది.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): 2017లో 65.45 శాతం నీటిని వెలికితీయగా 2022 నాటికి అది 41.60 శాతానికి తగ్గడం విశేషం. అలాగే, వార్షిక భూగర్భ జలాల వెలికితీతను పరిశీలిస్తే 2017లో 8.09 బీసీఎం (బిలియన్ క్యూబిక్ మీటర్లు) నుంచి 2022 నాటికి 8 బీసీఎంలకు తగ్గింది. రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ విజయవంతం కావడంతో సాగు, తాగునీటి అవసరాలకు ఉపరితల నీటి సరఫరా గణనీయంగా పెరిగింది. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కూడా రాష్ట్రంలో భూగర్భజల స్థాయిలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిందని అధికారులు తెలిపారు. తెలంగాణలో సగటు భూగర్భ జలమట్టం గత ఏడాది నవంబర్లో 4.97 ఎంబీజీఎల్ (భూస్థాయికి దిగువన మీటర్ల లోతు) ఉండగా, ఈ ఏడాది నవంబర్లో 4.5 ఎంబీజీఎల్గా ఉంది. 22 జిల్లాల్లో సగటు నీటి మట్టం 5 ఎంబీజీఎల్ కంటే తకువగా ఉండగా, మిగిలిన 11 జిల్లాల్లో ఇది 5-10 ఎంబీజీఎల్ మధ్య ఉంది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అంచనా ప్రకారం దేశంలో 2017 నుంచి 2022 మధ్య భూగర్భ జలాల వెలికితీత మొత్తం 248.69 బీసీఎం నుంచి 239.16 బీసీఎంకి తగ్గింది.
దేశంలో వార్షిక భూగర్భ జలాల వెలికితీత 2017లో 248.69 బీసీఎం ఉండగా, 2022లో 239.16 బీసీఎంకి తగ్గింది
తెలంగాణలో వార్షిక భూగర్భ జలాల వెలికితీత 2017లో 8.09 బీసీఎం నుంచి 2022 నాటికి 8 బీసీఎంకి తగ్గింది.
భూగర్భ జలాల వెలికితీత శాతం 2017లో 65.45 శాతం నుంచి 2022లో 41.6 శాతానికి తగ్గింది.
తెలంగాణలో గత ఏడాది నవంబర్లో 4.97 ఎంబీజీఎల్గా ఉన్న సగటు భూగర్భ జలమట్టం ఈ ఏడాది నవంబర్లో 4.5 ఎంబీజీఎల్కి పెరిగింది.