యాదగిరిగుట్ట, మే 2: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో భద్రతను మరింతగా పెంచారు. ఇప్పటికే 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, మంగళవారం యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ కమాండెంట్ త్రినాథ్ సమక్షంలో 19 మంది సిబ్బంది విధుల్లో చేరారు.
మరో 14 మంది సిబ్బంది త్వరలో విధుల్లో చేరనున్నారు. సీసీ కెమెరాలతోపాటు మెటల్ డిటెక్టర్లు, వాహనాల తనిఖీకి స్కానర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.