ఖమ్మం, ఫిబ్రవరి 6: బీజేపీ పాలనలో దేశంలో లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతిన్నదని, అసమానతలు పెరిగిపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశా రు. ఆదివారం ఖమ్మం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ పాలన ఈ దేశాన్ని దివాలా తీయించిందని ధ్వజమెత్తారు. ‘గోడకు చెప్పినా.. మోదీకి చెప్పినా ఒకటే’ అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ సమర్థిస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హకులను హరిస్తున్నదని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన వందశాతం వాస్తవమన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.