యాదగిరి గుట్ట, యాదాద్రి : యాదగిరి గుట్ట(Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానానికి మంగళవారం భారీగా ఆదాయము సమకూరింది. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణాల సముదాయాలను(Shopping Complex) లీజ్కు ఇవ్వడం వల్ల రూ. 40,82,890 ఆదాయం(Income) వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
ప్రధాన బుకింగ్(Main booking) ద్వారా రూ. 1,63,758, సుప్రబాతం ద్వారా రూ. 6,100, పుష్కరిణి ద్వారా వెయ్యి వ్రతాల ద్వారా ద్వారా రూ.48,800, ప్రచార శాఖ ద్వారా 27,520 వచ్చిందని వివరించారు. వీఐపీ దర్శనం(Vip darsaan) ద్వారా 45,000, యాదరుషి నిలయం ద్వారా రూ. రూ. 59,828 , ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 9,22,150, పాతగుట్ట ద్వారా రూ. 19,670 , కల్యాణకట్ట ద్వారా రూ. 46,600, శాశ్వత పూజల ద్వారా రూ. 57,500, వాహన పూజల ద్వారా రూ. 8,200 ఆదాయం సమకూరిందన్నారు.
కొండపైకి వచ్చే వాహనాల ప్రవేశం ద్వారా రూ. 1,50,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.రూ. 68,864, శివాలయం ద్వారా రూ. 7,600, అన్నదానం ద్వారా రూ. 82,061 , బ్రేక్ దర్శనం ద్వారా 92,100, ఇతర మార్గాల ద్వారా 25,975 ఆదాయం వచ్చిందని వివరించారు. మొత్తం స్వామివారికి ఆదాయము
రూ . 59,15,616 వచ్చిందని తెలిపారు.