శ్రీనగర్, జనవరి 6: జమ్ము కశ్మీర్తో పాటు ఉత్తరాది రాష్ర్టాల్లో చలి వణికిస్తున్నది. కశ్మీర్లో ఎముకలు కొరికే విధంగా చలి గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రతతో దాల్ సరస్సు ఉపరితలం పైపొరపై సన్నని మంచు పలక ఏర్పడింది. కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 4 డిగ్రీల కంటే తక్కువగా నమోదైందని అధికారులు శనివారం వెల్లడించారు.
శ్రీనగర్ పట్టణంలో శుక్రవారం రాత్రి మైనస్ 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయిందని తెలిపారు. మరోవైపు రాగల 3-4 రోజుల పాటు పలు రాష్ర్టాల్లో వర్షాలు, వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, ఏపీ దక్షిణ కోస్తా, ఢిల్లీ, ఛండీగఢ్, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ర్టాల్లో 6 -10 తేదీల మధ్య వర్షాలు కురవొచ్చని తెలిపింది.