Telangana | హైదారాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసారి అదనంగా మరో 70 నుంచి 75 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సుమారు 100 కంపెనీల బలగాలను రాష్ర్టానికి పంపింది. మరో 200 కంపెనీల సిబ్బందిని నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సమస్యాత్మక ప్రాంతాల్లో మొదట మోహరించనున్నారు.
2018 ఎన్నికల్లో రాష్ర్టానికి 280 కంపెనీలతో సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారు. ఈసారి ఆ సంఖ్యను మొదట 300 పెంచారు. ఇప్పుడు 70 నుంచి 75 కంపెనీలను అదనంగా కేటాయించనున్నట్టు సమాచారం. పొరుగు రాష్ర్టాల నుంచి ఎన్నికల విధుల కోసం 25 వేల మందిని కేటాయించినట్టు తెలిసింది.