హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : యూఎస్ వీసా దరఖాస్తు చార్జీలను యూఎస్ ఎంబసీ పెంచింది. విజిట్ వీసా, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అప్లికేషన్ చార్జీలను 160 డాలర్ల నుంచి 185 డాలర్లకు, హెచ్, ఎల్, వో, పీ, క్యూ, ఆర్ వీసా చార్జీలను 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు, ‘ఈ’ వీసా దరఖాస్తు చార్జీలను 205 డాలర్ల నుంచి 315 డాలర్లకు పెంచినట్టు యూఎస్ కాన్సులేట్ వర్గాలు వెల్లడించాయి.