హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై టోల్ చార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1-2023 నుంచి మార్చి 31,2024 వరకు అమల్లో ఉండేలా ధరలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధికారులు నిర్ణయించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతియేటా పెంచే టోల్ చార్జీల నిబంధనల మేరకు ఓఆర్ఆర్పై కొత్త టోల్చార్జీలు అమలు చేయనున్నారు. నగరం చుట్టు 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్పై 19 చోట్ల ఇంటర్చేంజ్లు ఉన్నాయి. కొత్తగా మరో మూడు ఇంటర్చేంజ్లను నిర్మిస్తున్నారు.