హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఇండ్లపై సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది. పీఎం సూర్య ఘర్-ముఫ్త్ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి గతంలో కంటే భారీగా రాయితీలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కానీ, 8 నుంచి 10 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన పెద్ద యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి మాత్రం సబ్సిడీని తగ్గించింది.
సబ్సిడీల పెంపు ఇలా..