హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రీపెయిడ్ మోటర్ క్యాబ్లు, ట్యాక్సీల చార్జీలు పెంచుతూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం పగలు కిలోమీటర్కు రూ.17 ఉండగా, రూ.21కి, రాత్రి రూ.20 నుంచి రూ.25కి పెంచింది. సర్వీస్ చార్జీ రూ.30 ఉండగా, రూ.38కి సవరించింది. మోటర్ వాహనాల అసోసియేషన్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం చార్జీలు పెంచుతూ జీవో జారీ చేయడంపై సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు వేముల మారయ్య, తెలంగాణ ఫోర్వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఫౌండర్ షేక్ సలావుద్దీన్ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.