హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లోని ప్రముఖ జ్యువెలరీ షాపుల్లో ఐటీ శాఖ అధికారులు శుక్ర, శనివారాల్లో సోదాలు నిర్వహించారు. శనివారం హైదరాబాద్లోని రెండుచోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో ఓ రెండు ప్రముఖ దుకాణాల పేర్లు వినిపిస్తున్నాయి. విజయవాడలో కేంద్ర బలగాల భద్రత నడుమ ఐటీ సోదాలు జరిగాయి.
పకా సమాచారం అందుకున్న అధికారులు వేర్వేరు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. ఈ రెండు జ్యువెలరీ షోరూమ్లలో ‘నో సేల్స్’ బోర్డ్ తగిలించి మరీ డాక్యుమెంట్లను పరిశీలించారు. బంగారం క్రయ విక్రయాలకు సంబంధించి సాఫ్ట్, హార్ట్ కాపీలను నిశితంగా పరిశీలించిన తర్వాత అధికారులు 25 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.