హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సహా కర్ణాటక, ఢిల్లీ నోయిడాల్లో గురువారం (రెండోరోజూ) ఇన్కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో సుమారు 40 ప్రాంతాల్లో దాదాపు వందకు పైగా బృందాలు దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం. రెండోరోజూ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలతో సహా పలు గుట్కా, మసాలా కంపెనీల్లో సోదాలు జరిగాయి.
వీటితో పాటుగా ఆయా సంస్థల ప్రతినిధుల ఇండ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండోరోజూ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడ్డట్టు తెలిసింది. నగదుతోపాటు పన్ను ఎగవేతకు సంబంధించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.