హైదరాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): కేంద్రం ప్రకటించిన ఆదాయ పన్ను పరిమితులు ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ) విమర్శించింది. పాత, కొత్త పన్ను విధానాలను కొనసాగిస్తూ క్రమంగా పాత పన్ను విధానాన్ని ఎత్తేయడానికే కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందని జాతీయ ఉపాధ్యక్షుడు వీ కృష్ణమోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కార్పొరేట్లు, ధనికులకు అధిక పన్ను రాయితీ ఇచ్చిన ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించలేదని తెలిపారు. తకువ వేతనాదాయ వర్గాలు వినియోగించుకుంటున్న పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచడం నామమాత్రమేనని తెలిపారు. పొదుపు మొత్తాలపై రాయితీని రూ.1.50 లక్షలను అలాగే కొనసాగించారని పేరొన్నారు. 2014కు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్ చేసిన స్టాండర్డ్ డిడక్షన్ రూ.5 లక్షలు గానీ, పొదుపు మొత్తాలపై మినహాయింపు రూ.3 లక్షలకు పెంచాలన్న డిమాండ్ను అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేండ్ల కాలంలో అమలు చేయలేదని విమర్శించారు.