హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో గురువారం మరోసారి పలుచోట్ల ఐటీ సోదాలు కలకలం రేపాయి. గురువారం తెల్లవారుజామునే సుమారు 100 ఇన్కం ట్యాక్స్ బృందాలుగా పలు ప్రాంతాల్లో సోదాలు చేశాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇంటితో పాటు, బంధువులతో పాటు పలు కంపెనీలు, వ్యక్తుల ఇండ్లలో తనిఖీలు కొనసాగాయి. నగరంలోని పూజాకృష్ణ చిట్ ఫండ్ కార్యాలయం, ఇంట్లో కలిపి 40 మంది అధికారుల సోదాలు చేశారు. అలాగే, పలు చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన యజమానుల ఇండ్లు, ఆఫీసులతో పాటు స్థిరాస్తి సంస్థల్లో సోదాలు జరిగాయి. సోదాల్లో భాగంగా దస్త్రాలు, బ్యాంకు ఖాతాలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
శంషాబాద్ పట్టణం హుడాకాలనీలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత రఘువీర్ ఇంటిలో సోదాలు చేశారు. అరెకపూడి కోటేశ్వరరావు, అవిర్నేని వరప్రసాద్ ఇండ్లల్లో సోదాలు జరిగాయి. చిట్ఫండ్, స్థిరాస్తి కంపెనీల్లో అవకతవకలు జరిగాయనే సమాచారం మేరకు సోదాలు జరిగినట్టు తెలిసింది. అయితే, బుధవారం సాయంత్రానికే దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ఐటీ అధికారులు భారీగా హైదరాబాద్కు చేరుకొని నిర్ణీత వ్యక్తులు, నాయకులు, ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ప్రధాని మోదీ వచ్చి వెళ్లడం.. ఆ వెంటనే ఐటీ రైడ్స్ జరగడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఎన్నికలు ఎకడుంటే.. అకడికి మోదీ, అమిత్షా వెళ్తారని, వారు వెళ్లిన వెంటనే ఐటీ సహా, కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రవేశిస్తాయని విపక్ష నేతలు ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తుంటారు. వారి విమర్శలకు తగ్గట్టుగానే గురువారం ఐటీ రైడ్స్ జరిగాయి.