జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS)లోకి వలసలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్కు జై కొడుతున్నారు. తాజాగా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామం గుట్ట కింది తండాకి చెందిన బంజారా నాయకులు10 మంది, లక్ష్మినారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సమ్మన్న, సోమయ్య, యాదగిరి తదితరులు, తొర్రూరు మండలం కంఠయపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, తొర్రూర్ మున్సిపాలిటీ ఐదవ వార్డ్ దుబ్బ తండాకి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
వారికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం పని చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత వారి వారి గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.