చర్లపల్లి, ఆగస్టు 26: త్వరితగతిన కేసులను విచారించి, సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరధే తెలిపారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కోర్టుల సముదాయ భవనాన్ని సీజే ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ అలోక్ అరధే మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర న్యాయం అందించినప్పుడే న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. ఏండ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా లోక్ అదాలత్లో రాజీ చేసిన లబ్ధిదారుల క్లెయిమ్ రూ.25 లక్షల చెక్కును న్యాయవాదులకు అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహరెడ్డి, అధికారి ప్రవీణ్కుమార్, జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహరెడ్డి, జిల్లా కోర్టు అడ్మిస్ట్రేషన్ జడ్జి వినోద్కుమార్, జిల్లా కోర్టు సెషన్ జడ్జి బీఆర్ మధుసూదన్రావు, మాజీ చీఫ్ జస్టిస్ నవీన్రావు, వివిధ కోర్టుల న్యాయమూర్తులు జస్టిస్ రఘునాథ్రెడ్డి, జస్టిస్ డీఎస్ ప్రసాద్, జస్టిస్ ప్రవీణ్కుమార్, రిజిస్ట్రార్ జనరల్ తిరుమలదేవి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ మాధవి, జిల్లా బార్ కౌన్సిల్ అధ్యక్ష, కార్యదర్శులు కోట రామచంద్రారెడ్డి, రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.