హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఈ నెల 21న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి పుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అర్చక, ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ను బుధవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమ్మేళనంలో పాల్గొనాలంటూ నిర్వాహకులు మంత్రిని ఆహ్వానించారు. మంత్రిని కలిసినవారిలో అర్చక, ఉద్యోగ సంఘం రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, గద్వాల జిల్లా కన్వీనర్ రాఘవేంద్ర తదితరులు ఉన్నారు.