హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఈ ఉద్యోగాలకు రెండేండ్ల వయోపరిమితి ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలోని అంబేద్కర్ మెమోరియల్ సెంటర్ వద్ద ఏర్పా టు చేసిన సింగరేణి జాబ్మేళాలో 441 మందికి సీఎం కారుణ్య నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీచేస్తామని, నిరుద్యోగులు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్బోర్డు ద్వారా 15రోజుల్లో 15వేల పోలీ సులు నియామకాలు చేపడతామని పేర్కొన్నారు.
సింగరేణిని కంటికిరెప్పలా కాపాడుకుంటాం
రాష్ట్రానికి తలమానికమైన సింగరేణి సంస్థను కం టికిరెప్పలా కాపాడుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుంటుందని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభు త్వం కార్మికుల పట్ల మానవీయంగా వ్యవహరిస్తుందని, కార్మిక హకులు కాపాడుతూ ప్రజా పాలనను అందిస్తామని తెలిపారు. పారదర్శకంగా నియామకాలు చేస్తామని చెప్పామని, దీంట్లో భాగంగానే అంబేదర్ సాక్షిగా 441 మందికి ఉద్యోగ నియామక పత్రా లు అందించినట్టు చెప్పారు. బొగ్గు బావులు సింగరేణికే చెందేలా కేంద్రంతో మాట్లాడుతున్నామని తెలిపారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి సింగరేణి సంస్థను ప్రభుత్వం కాపాడుతుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, వినోద్, వివేక్, ప్రేమ్సాగర్రావు తదితరులు పాల్గొన్నారు.