నల్లగొండ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని కట్టంగూర్ మండలంలోని పామనగుండ్ల గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 కుటుంబాలు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధికి చిరునామాగా మార్చారని ప్రశంసించారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు. పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.