నిజామాబాద్, ఆగస్టు 30 : సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై మోర్తాడ్ మండల కేంద్రం, సుంకెట్, శెట్పల్లి, వేల్పూర్ మండలం పోచంపల్లి, జాన్కంపేట్, అక్లూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కమ్మర్పల్లి వడ్డెర సంఘం సభ్యులు సుమారు 1000 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి వైపే ఉంటామని ముందుకు రావడం మంచి మార్పునకు నాంది అన్నారు. ఎన్నికలు రాగానే కొంతమంది ఊర్ల మీద పడి అమలు సాధ్యం కాని హామీలిస్తారని, ఓట్లు డబ్బాలో వేసుకున్నాక ముఖం చాటేస్తారన్నారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని గెలిచిన ఎంపీ అర్విందే ఇందుకు ఉదాహరణ అన్నారు.
అలాంటి వారి పట్ల అప్రత్తంగా ఉండాలన్నారు. కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నమ్మితే గోస పడుతామన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిపై ప్రతి గ్రామం.. ప్రతి ఇంట్లో చర్చ జరగాలని కోరారు. కేసీఆర్ సర్కార్ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు వివరిస్తూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.