ఖమ్మం, అక్టోబర్ 2 : తెలంగాణ ప్రభుత్వం నగరంలో చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ 28వ డివిజన్కు చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన 50 కుటుంబాలు కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీ వెంకన్న అధ్వర్యంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు గడపగడపకూ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను ఆఖండ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.
కాగా.. పార్టీలో చేరిన వారిలో తురక వెంకన్న, శాగ బగ్గలయ్య, చెరుకుపల్లి రాంబాబు, జి.నాగేశ్వరరావు, పత్తికొండ వెంకటేశ్వర్లు, జి.పుల్లారావు, పాముల కృష్ణమూర్తి, తడబోయిన రాందాసు, మదాసి జనార్దన్, తాటికొండ మోహన్రావు, పొడకంటి వేణు, పిల్లలమర్రి తిరుపతయ్య, బంగారు సత్యనారాయణ, సంకీసుల వెంకటేశ్వర్లు, వెంకటరమణ, చెరుకూరి సుధాకర్, కోటిబోయిన పర్వతాలు, కళ్లెం సత్తిరెడ్డి, ఆలేటి రాము, బ్రహ్మం, నల్లబెల్లి సోమశేఖర్, శ్రీనివాస్, వెంకయ్య, రామారావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీ వెంకన్న, డివిజన్ అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు, కొప్పెరా నర్సింహారావు, దడాల రఘు, సుంకర సతీశ్, లింగయ్య, బాసిపొంగు వెంకటేశ్వరరావు, గంగరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.