హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. టీఆర్ఎస్కు 16 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నా కనీసం ఒక్క పార్లమెంటరీ కమిటీకి కూడా చైర్మన్ను నియమించలేదు. పార్లమెంటరీ కమిటీలను నియమిస్తూ మంగళవారం పార్లమెంట్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు పరిశ్రమల శాఖ కమిటీ చైర్మన్గా ఉన్న కే కేశవరావును ఆ కమిటీలో కేవలం సభ్యుడిగా నియమించారు.
నామా నాగేశ్వర్ రావు లైబ్రరీ కమిటీ చైర్మన్గా ఉండగా ఆయనను ఆర్థిక శాఖ కమిటీలో సభ్యుడిగా నియమించారు. కమిటీల చైర్మన్ విషయంలో ప్రతిపక్షాల సభ్యులను తగ్గిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి కేంద్రంలోని బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారుతున్నది. ఈ తరుణంలో కేంద్రం టీఆర్ఎస్, తెలంగాణ పట్ల వివక్ష చూపిందనడానికి ఇదే తార్కాణంగా చెప్పవచ్చు.
కే కేశవరావు పరిశ్రమల శాఖ
నామా నాగేశ్వర్ రావు ఆర్థిక శాఖ
దీవకొండ దామోదర్ రావు ఆర్థిక శాఖ
కొత్త ప్రభాకర్ రెడ్డి సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, పర్యావరణం
సంతోష్కుమార్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, పర్యావరణం
బీబీ పాటిల్ వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్
మాలోతు కవిత ఉక్కు, బొగ్గు, ఖనిజం
బీ లింగయ్య యాదవ్ ఉక్కు, బొగ్గు, ఖనిజం
పసునూరి దయాకర్ కార్మిక, టెక్స్టైల్, స్కిల్ డెవలప్మెంట్
కేఆర్ సురేశ్ రెడ్డి పర్సనల్ , పబ్లిక్ గ్రీవెన్సెస్, న్యాయ, జస్టిస్
బీ వెంకటేశ్ పర్సనల్ , పబ్లిక్ గ్రీవెన్సెస్, న్యాయ, జస్టిస్
జీ రంజిత్ రెడ్డి కమ్యూనికేషన్స్, ఐటీ
పీ రాములు రైల్వేలు
ఎం శ్రీనివాస్ రెడ్డి విదేశీ వ్యవహారాలు
బీ పార్థసారధి రెడ్డి వైద్యం, కుటుంబ సంక్షేమం
వద్దిరాజు రవిచంద్ర పెట్రోలియం, సహజ వనరులు