హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రూ. 49. 2 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా (DGP Ravigutpa ) తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 466 పోలీసు ఫ్లైయింగ్ స్క్వాడ్లను (Flying squads) , 85 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, వీరి తనిఖీల్లో రూ. 31. 12 కోట్లు నగదును, రూ. 3.21 కోట్ల విలువ గల మద్యాన్ని పట్టుకున్నామని వివరించారు.
రూ. 5.41 కోట్ల విలువగల నార్కొటిక్స్ డ్రగ్స్ను, రూ. 7.66 కోట్ల విలువ గల 16.897 కిలోల బంగారం, 36.532 కిలోల సిల్వర్ను పట్టుకున్నామన్నారు. మరో కోటి 62 లక్షల రూపాయల విలువ గల వస్తువును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 6,647 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్, 8 లైసెన్స్ లేని ఆయుధాలను సీజ్ చేశామని తెలిపారు. అదేవిధంగా జిలెటిన్ స్టిక్స్, డిటోనెటర్లను, విద్యుత్ వైర్లను, పేలుడు సామగ్రిని పట్టు్కున్నామని డీజీపీ వివరించారు.