హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) ప్రాజెక్టుకు టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. నల్సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం హైదరాబాద్లోని బస్భవన్లో ఈఆర్పీ సేవలను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని డిపోలు, జోన్లతోపాటు ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలను ఏకీకృతం చేసే ఈఆర్పీతో టీఎస్ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీతో కలిసి పనిచేయడం సంతోషాన్ని కలిగిస్తున్నదని నల్సాఫ్ట్ సీఈవో నల్లూరి వెంకట్ తెలిపారు.