రంగారెడ్డి : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న టేబుల్ టెన్నిస్ ఆడిటోరియం(Auditorium) ప్రమాదవశాత్తు కూలిపోవడంతో బతుకు దెరువు కోసం వచ్చిన ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో ఆగురికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం కనకమామిడిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
ప్రమాదం జరిగే సమయంలో ఆడిటోరియంలో 14 మంది కూలీలు పని చేస్తున్నట్లు సమాచారం. ఆడిటోరియం శిథిలాల్లో ముగ్గురు కూలీలు చిక్కుకోగా శిథిలాల నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. గాయపడిన కూలీని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా, శిథిలాల్లో చిక్కుకున్న మరో కూలీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు బిహార్కు చెందిన బబ్లూ, పశ్చిమ బెంగాల్కు చెందిన సునిల్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.