హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున రూపుదిద్దుకుంటున్న డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహం దేశానికే తలమానికంగా నిలువనున్నదని మంత్రుల బృందం పేర్కొన్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను మంత్రులు కే తారకరామారావు, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి బృందం శుక్రవారం పరిశీలించింది.
ప్రధాన విగ్రహంతోపాటు నిర్మాణంలో ఉన్న రాక్ గార్డెన్, ల్యాండ్ సేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెన్, సాండ్ స్టోన్ వర్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్ సీలింగ్ తదితర పనులను మంత్రులు పరిశీలించారు. అనంతరం అధికారులు, వర్ ఏజెన్సీతో సమావేశమై పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేదర్ విగ్రహంగా, తెలంగాణకే మణిహారంగా నిలుస్తుందని వివరించారు. ఈ నెల 14న అంబేదర్ జయంతి రోజున విగ్రహం ఆవిషరణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. వారం రోజుల్లో నిర్మాణ పనులన్నీ పూర్తిచేసే లక్ష్యంతో సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. విగ్రహం నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 టన్నుల ఇత్తడిని ఉపయోగిస్తున్నట్టు వివరించారు. మంత్రుల వెంట కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.