ఖైరతాబాద్, ఫిబ్రవరి 12: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పిరెడ్డిపల్లి శివారులోని ఐఎంఆర్ ఆగ్రో వెట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, దుర్వాసనతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఆ చుట్టుపక్క గ్రామాల ప్రజలు వాపోతున్నారు. బాధితులు రమేశ్ నాయక్, మల్లేశ్, కే బాలు, నరసింహ, మాజీ సర్పంచ్ జంగయ్య తదితరులు సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
జంతువుల కళేబరాలతో ఆ ఫ్యాక్టరీలో నూనెలు, పొడులను తయారు చేస్తుండటం వల్ల గాలి, నీరు కలుషితమై తమ జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ఇప్పటికే అనేక పాడిపశువులు మృతిచెందాయని, అంతు చిక్కని రుగ్మతలతో దాదాపు 30 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. దీనిపై జిల్లా కలెక్టర్తోపాటు పోలీస్, పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.