హైదరాబాద్, ఫిబ్రవరి23 (నమస్తే తెలంగాణ): బీసీ సబ్ప్లాన్ పకడ్బందీగా అమలు కావాలంటే కులగణన జరగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార చెప్పారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి బీసీ మేధావులు, అధికారులతో శుక్రవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కులగణనకు సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. కులగణనకు బీహార్ రాష్ట్ర విధివిధానాలను, సర్వే తీరును అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి పొన్నం చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ మురళీధర్, ప్రొఫెసర్ సింహాద్రి, బీసీ నేత క్రాంతికుమార్, ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు.