హైదరాబాద్, మార్చి 6(నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ, ఉద్యాన, సహకార, మారెటింగ్ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. 99 రోజుల కార్యచరణలో భాగంగా మే 4 నుంచి మే 10 వరకు నిర్వహించే వ్యవసాయ సంబంధింత కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ, నానో యూరియా వినియోగంపై అవగాహన, వానాకాలం పంటల సిద్ధతపై కార్యక్రమాలు, బ్యాంకర్లతో రుణ మేళాలు, రైతు-శాస్త్రవేత్తల సమావేశాలు, ఉత్తమ రైతులకు సన్మానాలు, రైతు మేళాల వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా అవగాహన కల్పించాలని సూచించారు.