TG Weather | తెలంగాణలో వర్షాలు మరో నాలుగు రోజులు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలే పడే అవకాశాలున్నాయని తెలిపింది. బుధవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలో భారీ వర్షాలు పడుతాయని.. మంచిర్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా సిరికొండలో 11.8, నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లి 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.