హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని పేర్కొన్నది. అలాగే ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది.
వీటి ప్రభావంతో 4వ తేదీ నుంచి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 440 మండలాల్లో పొడివాతావరణం ఏర్పడినట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. మిగిలిన వాటిల్లో 10 మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురువగా.. పలుచోట్ల చిరు జల్లులు కురిశాయని వివరించింది.