Monsoon | హైదరాబాద్ : దేశంలోకి జూన్ 1న రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూన్ 4న రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం వివరాలను ఐఎండీ వెల్లడించింది. ఈ సంవత్సరం వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
వచ్చే వారం రోజుల్లో అరేబియా సముద్రంలో తుఫాను వచ్చే అవకాశాలు కూడా లేవని స్పష్టం చేసింది. ఉత్తరాదిన రుతుపవనాలకు ముందుగానే వర్షాలు పడడానికి, పాశ్చాత్య దేశాల్లో వాతావరణ అసమతుల్యతే కారణమని వెల్లడించింది. పాశ్చాత్య దేశాల్లో వాతావరణ సమతుల్యత కారణంగానే భారత్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. అందుకే ఢిల్లీతో పాటు చుట్టుపక్క నగరాలు కాస్త ఉపశమనాన్ని పొంతుందున్నాయని చెప్పింది. ఒకవేళ దేశం మొత్తం ఒకే తరహాలో వర్షపాతం నమోదైతే అనుకూల పరిస్థితులే ఉంటాయని.. అప్పుడు ఎటువంటి సమస్య ఉండదని, వ్యవసాయంపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు అని భారత వాతారణ శాఖ తెలిపింది.