Summer | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ సూచించింది. ఆయా జిల్లాలకు అధికారులు సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సైతం వడగాలుల హెచ్చరికలు చేశారు. సోమవారం నుంచి కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని, రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొన్నారు.