Red Alert | రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న 24గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఈమేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసిన వాతావరణశాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, భువనగిరిలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ను జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది వాతావరణశాఖ. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు నిజామాబాద్, వరంగల్, జనగాం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది.